Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 10:49 PM

పేదరికం నుంచి.. గోల్డ్ మెడల్‌ దాకా!

పేదరికం నుంచి.. గోల్డ్ మెడల్‌ దాకా!

పేదరికం నుంచి.. గోల్డ్ మెడల్‌ దాకా!
11-09-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ బిడ్డ డా. డి. మాక్లాకు అరుదైన గౌరవం

ఉస్మానియా వర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పురస్కారం.

హైదరాబాద్, సెప్టెంబర్‌ 11: పేదరికాన్ని జయించి ఉన్నత విద్యలో రాణించిన నల్గొండ జిల్లా బిడ్డ డా. డి. మాక్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం హయత్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌’ను ప్రదానం చేసింది.

సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ వార్షిక స్నాతకోత్సవంలో డా. మాక్లా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2025 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్‌ ఫ్యాకల్టీలోని ఇంగ్లిష్‌ విభాగంలో షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) విద్యార్థి సమర్పించిన ఉత్తమ పీహెచ్‌డీ థీసిస్‌కు ఈ గోల్డ్‌ మెడల్‌ లభించింది.

మారుమూల పల్లె నుంచి..

నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన డా. డి. మాక్లా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే విద్యను ఆయుధంగా చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు. మారుమూల పల్లె నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకోవడంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకునే స్థాయికి చేరింది.

పరిశోధనా రంగంలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. డా. మాక్లాకు హయత్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లిష్‌ విభాగం అధ్యాపకులు, వెంకటాద్రిపాలెం గ్రామస్తులు, విద్యార్థులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

Sthanikam

పేదరికం నుంచి.. గోల్డ్ మెడల్‌ దాకా!

Article Image

నల్గొండ బిడ్డ డా. డి. మాక్లాకు అరుదైన గౌరవం

ఉస్మానియా వర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పురస్కారం.

హైదరాబాద్, సెప్టెంబర్‌ 11: పేదరికాన్ని జయించి ఉన్నత విద్యలో రాణించిన నల్గొండ జిల్లా బిడ్డ డా. డి. మాక్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం హయత్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌’ను ప్రదానం చేసింది.

సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ వార్షిక స్నాతకోత్సవంలో డా. మాక్లా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2025 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్‌ ఫ్యాకల్టీలోని ఇంగ్లిష్‌ విభాగంలో షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) విద్యార్థి సమర్పించిన ఉత్తమ పీహెచ్‌డీ థీసిస్‌కు ఈ గోల్డ్‌ మెడల్‌ లభించింది.

మారుమూల పల్లె నుంచి..

నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన డా. డి. మాక్లా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే విద్యను ఆయుధంగా చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు. మారుమూల పల్లె నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకోవడంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకునే స్థాయికి చేరింది.

పరిశోధనా రంగంలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. డా. మాక్లాకు హయత్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లిష్‌ విభాగం అధ్యాపకులు, వెంకటాద్రిపాలెం గ్రామస్తులు, విద్యార్థులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News