Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 09:57 PM

మునుగోడు యువతకు ‘ఆసరా’గా మెగా ఉద్యోగ మేళా: 50 పైగా సంస్థలు, 3,000 ఖాళీలు

మునుగోడు యువతకు ‘ఆసరా’గా మెగా ఉద్యోగ మేళా: 50 పైగా సంస్థలు, 3,000 ఖాళీలు

మునుగోడు యువతకు ‘ఆసరా’గా మెగా ఉద్యోగ మేళా: 50 పైగా సంస్థలు, 3,000 ఖాళీలు
12-09-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: బొల్లా శివశంకర్

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘ఆసరా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో భారీ మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లా శివశంకర్ తెలిపారు. శనివారం చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేళా వివరాలను వెల్లడించారు. ​యువతకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు 50కి పైగా ప్రముఖ ఐటీ, సాఫ్ట్‌వేర్, తయారీ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్, మార్కెటింగ్ సంస్థలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా వివిధ రంగాల్లో సుమారు 3,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అర్హత కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంత కాళ్లపై నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 27, 2026 (ఆదివారం) ​సమయం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తంగడపల్లి, ​ఈ ఉద్యోగ మేళా ఏర్పాట్లలో ఆసరా ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లా కవిత, కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

మునుగోడు యువతకు ‘ఆసరా’గా మెగా ఉద్యోగ మేళా: 50 పైగా సంస్థలు, 3,000 ఖాళీలు

Article Image

నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: బొల్లా శివశంకర్

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘ఆసరా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో భారీ మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లా శివశంకర్ తెలిపారు. శనివారం చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేళా వివరాలను వెల్లడించారు. ​యువతకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు 50కి పైగా ప్రముఖ ఐటీ, సాఫ్ట్‌వేర్, తయారీ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్, మార్కెటింగ్ సంస్థలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా వివిధ రంగాల్లో సుమారు 3,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అర్హత కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంత కాళ్లపై నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 27, 2026 (ఆదివారం) ​సమయం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తంగడపల్లి, ​ఈ ఉద్యోగ మేళా ఏర్పాట్లలో ఆసరా ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లా కవిత, కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News