వరుణ యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణ యాగం మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వరుణ యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతన్నలు సుభిక్షంగా ఉండేందుకు సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. వరుణ యాగం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని వేణారెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి