Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 12:47 AM

వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
11-09-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌, మిస్సింగ్‌, ఎన్‌బీడబ్ల్యూ కేసులను సమీక్షించి, కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. నేరాల దర్యాప్తులో సంఘటనా స్థలంలో లభించే ఆధారాలను పకడ్బందీగా సేకరించి, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను ఉపయోగించాలని తెలిపారు. మిస్సింగ్‌ కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించి బాధితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, ఎన్‌బీడబ్ల్యూ కేసుల్లో వారెంట్ల అమలుపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు.రాబోయే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. గణేష్‌ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్‌, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జన మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీపీఓల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సమర్థవంతంగా కేసుల దర్యాప్తు చేసిన ఐఓలు రేణుకరెడ్డి, వెంకటరాజాగౌడ్‌,రంగా కృష్ణతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వినాయక చవితికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

Article Image

మెదక్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌, మిస్సింగ్‌, ఎన్‌బీడబ్ల్యూ కేసులను సమీక్షించి, కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. నేరాల దర్యాప్తులో సంఘటనా స్థలంలో లభించే ఆధారాలను పకడ్బందీగా సేకరించి, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను ఉపయోగించాలని తెలిపారు. మిస్సింగ్‌ కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించి బాధితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, ఎన్‌బీడబ్ల్యూ కేసుల్లో వారెంట్ల అమలుపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు.రాబోయే వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. గణేష్‌ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్‌, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జన మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీపీఓల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సమర్థవంతంగా కేసుల దర్యాప్తు చేసిన ఐఓలు రేణుకరెడ్డి, వెంకటరాజాగౌడ్‌,రంగా కృష్ణతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News