Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు..... కోదాడలో కొలువుల జాతర.... 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 01:35 PM

12 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి

12 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి

12 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి
12-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకుల ఆందోళన

సూర్యాపేట–జనగాం రోడ్డుపై బైఠాయింపు.. యార్కారం సబ్‌స్టేషన్‌ ఎదుట నిరసన వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను కనీసం 12 గంటలపాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. యార్కారం సబ్‌స్టేషన్‌ ఎదుట రైతాంగంతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం సూర్యాపేట–జనగాం ప్రధాన రహదారిపై బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.

వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన 12 గంటల విద్యుత్‌ అందించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు వారికి అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. విద్యుత్‌ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

12 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి

Article Image

రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకుల ఆందోళన

సూర్యాపేట–జనగాం రోడ్డుపై బైఠాయింపు.. యార్కారం సబ్‌స్టేషన్‌ ఎదుట నిరసన వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను కనీసం 12 గంటలపాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. యార్కారం సబ్‌స్టేషన్‌ ఎదుట రైతాంగంతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం సూర్యాపేట–జనగాం ప్రధాన రహదారిపై బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.

వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన 12 గంటల విద్యుత్‌ అందించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు వారికి అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. విద్యుత్‌ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News