నూతనకల్;
అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.ప్రతి 45 రోజులకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని,లేనియెడల శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో సునీత హెచ్చరించారు.ఆయా శాఖల అధికారులు తమ శాఖల నివేదికను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్ పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీఓ హరి సింగ్, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి