వినాయక చతుర్థి వేడుకలు, గణేష్ మండపాల ప్రాంగణాల్లో హిందూ ధర్మాన్ని, దేవుళ్లను కించపరిచే విధంగా అసభ్యకరమైన రీల్స్, వీడియోలు చేయవద్దని బజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి విజ్ఞప్తి చేశారు. వినాయక మండపాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, అవి భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకలని ఆయన గుర్తుచేశారు.సోషల్ మీడియాలో కొన్ని సెకన్ల పాటు ప్రసిద్ధి (వైరల్) చెందడం కోసం మండపాల వద్ద అసభ్యకరమైన హావభావాలు, అనుచిత డ్యాన్స్లు, అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడియోలు చిత్రీకరించడం ధర్మాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా కంటెంట్ రూపొందించుకోవచ్చని, అయితే ధర్మ పరిధి దాటకుండా, ఇతరుల భక్తి భావాలను దెబ్బతీయకుండా నడుచుకోవాలని సూచించారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న ఆయన, మండపాల నిర్వాహకులు కూడా ఇటువంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, గణనాథుని పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి