Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 08:14 PM

విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం

విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం

విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం
11-09-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వినాయకుడి ఆకృతిలో కూర్చొని.. భక్తి చాటుకున్న మల్లికార్జున పాఠశాల విద్యార్థులు

రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని మల్లికార్జున ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం వినూత్న రీతిలో భక్తిని చాటుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులంతా ఒకచోట చేరి విఘ్నేశ్వరుడి ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన దృశ్యం విశేషంగా ఆకట్టుకుంది. ​ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణాధికారి మారెపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే బొజ్జ గణపయ్య విద్యార్థులకు జ్ఞానం, వివేకం, ఏకాగ్రతను ప్రసాదిస్తాడన్నారు. స్వామివారి ఆదర్శాలను పుణికిపుచ్చుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం అలరించిందని, విద్యార్థుల సృజనాత్మకత అభినందనీయమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తోట లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు మోనాలిక, ఎస్.బి.రాజ్, శైలజ, కవిత, దీపలక్ష్మి, హీనా, రజిత, సబిత, సానియా, సనా, సంతోష, నేహా, శృతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల సృజనాత్మకత.. ఆకట్టుకున్న గణపతి రూపం

Article Image

వినాయకుడి ఆకృతిలో కూర్చొని.. భక్తి చాటుకున్న మల్లికార్జున పాఠశాల విద్యార్థులు

రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని మల్లికార్జున ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం వినూత్న రీతిలో భక్తిని చాటుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులంతా ఒకచోట చేరి విఘ్నేశ్వరుడి ఆకారంలో కూర్చొని ప్రదర్శించిన దృశ్యం విశేషంగా ఆకట్టుకుంది. ​ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణాధికారి మారెపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే బొజ్జ గణపయ్య విద్యార్థులకు జ్ఞానం, వివేకం, ఏకాగ్రతను ప్రసాదిస్తాడన్నారు. స్వామివారి ఆదర్శాలను పుణికిపుచ్చుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం అలరించిందని, విద్యార్థుల సృజనాత్మకత అభినందనీయమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తోట లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు మోనాలిక, ఎస్.బి.రాజ్, శైలజ, కవిత, దీపలక్ష్మి, హీనా, రజిత, సబిత, సానియా, సనా, సంతోష, నేహా, శృతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News