107 బస్తాల సిమెంట్ స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా లూస్ సిమెంటును బస్తాలలో నింపుతున్న ముఠా గుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు ఏఎస్ఐ పి. కరుణాకర్ తంగేడు వనం వద్ద దాడి చేసి, అక్రమంగా బస్తాల్లో నింపుతున్న సుమారు 82 లూస్ సిమెంట్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తూప్రాన్ పేట గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ (1226) ఏ. సైదయ్య జరిపిన తనిఖీల్లో మరో 25 అక్రమ సిమెంట్ బస్తాలు పట్టుబడ్డాయి. మొత్తం 107 బస్తాల సిమెంటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను విచారించగా, చౌటుప్పల్ టౌన్ కు చెందిన దేశగోని సుధాకర్ (45, తండ్రి: దానయ్య), చిట్యాలకు చెందిన గుండాల శ్రీను (50, తండ్రి: సోమయ్య)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి