ఎస్పీ అక్షంశ్ యాదవ్, సీఐ మోలుగూరి రవి అభినందనలు
రామన్నపేట, సెప్టెంబర్ 12, స్థానికం ప్రతినిధి:
బస్టాండ్లలో మహిళలను టార్గెట్ చేసి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మోలుగూరి రవి పర్యవేక్షణలో, ఎస్ఐ గోపతి సతీష్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో టోల్గేట్లను తప్పించుకుని కారులో వెళ్తున్న నిందితులు పట్టుబడ్డారు.
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావడి అలివేలు (45), కడ్రెద్దుల మరియమ్మ (33), కావడి మహంకాళి అలియాస్ లక్ష్మి (39), చౌట భానుప్రసాద్ (24)గా గుర్తించారు. చౌటుప్పల్ బస్టాండ్లో 45 గ్రాముల బంగారు ఆభరణాలు, రామన్నపేటలో పల్లివాడకు చెందిన రాంనర్సమ్మ మెడలోని 32.5 గ్రాముల పుస్తెలతాడును బ్లేడుతో కట్ చేసి చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ, ఏపీలోనూ వీరిపై గతంలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
పోలీసు బృందానికి అభినందనలు
కేసును ఛేదించిన ఎస్ఐ గోపతి సతీష్ బృందాన్ని జిల్లా ఎస్పీ అక్షంశ్ యాదవ్ అభినందించారు. సీఐ మోలుగూరి రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి