రామన్నపేట, సెప్టెంబర్ 12:
ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, దేశ సమైక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మార్క్సిస్టు మేధావి, మాజీ ఎంపీ కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సీపీఎం మండల కార్యవర్గ సభ్యుడు కల్లూరి నగేష్ అన్నారు. ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా శనివారం రామన్నపేట పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ.. మతోన్మాద, మనువాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, అభ్యుదయ, లౌకిక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మార్క్సిస్టు నేతగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.
కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు బావుండ్లపల్లి బాలరాజు, గొరిగే సోములు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్, ఆముద ఆంజనేయులు, దూదిమెట్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి