నాగారం ;
ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి జారిపడి బాలుడు మృతి చెందిన సంఘటన శాంతిగర్ శివారులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తుంగతుర్తి నియోజకవర్గ నాగారం మండల పరిధిలోని శాంతినగర్ గ్రామానికి చెందన షేక్.కమాల్–సైదాబి దంపతులకు షేక్.అక్బర్, షేక్ అన్వర్ ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడైన షేక్. అన్వర్ (15) ట్రాక్టర్ పని నిమిత్తం రాయి వేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాక్టర్లో రాయిని లోడ్ చేసుకొని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ఇంజన్కు తొట్టికి మద్యలో ఇనుప కడ్డిపై నిలబడ్డాడు. వర్షానికి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో అన్వర్ పై నుంచి ట్రాక్టర్ తొట్టి వెళ్లడంతో అక్కడిక్కక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి