విద్యార్థులను ప్రోత్సహిస్తున్న
హెచ్ ఎం తోటకూరి యాదయ్య
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని భువనగిరి పట్టణ శివారులోని శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూరి యాదయ్య పిలుపునిచ్చారు. భువనగిరి మండల స్థాయిలో జరిగిన ఎస్ జీ ఎఫ్ అండర్ 14,17 విభాగాల్లో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు యు. అక్షిత, అండర్ -14 విద్యార్థులకు జరిగిన 600 మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతిని, బి. రాకేష్, అండర్ -14 విద్యార్థులకు జరిగిన లాంగ్ జంప్ పోటీల్లో మొదటి బహుమతులు గెలుపొందగా, టి. శిరీష, అండర్ -17 విద్యార్థులకు జరిగిన షోట్ పుట్ పోటీల్లో ద్వితీయ బహుమతి, ఆర్. ధనుష్, బి రుతిన్ లు అండర్ -17 విద్యార్థులకు జరిగిన కబడ్డీ పోటీల్లో ద్వితీయ బహుమతులు,
ఐ. జస్వంత్, అండర్ -14 కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు మండల స్థాయి క్రీడల్లో పాల్గొని గెలుపొంది , జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూరి యాదయ్య, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి