Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ ఉత్సవాలకు సన్నద్ధం.. నగర సమితి కార్యాలయం ప్రారంభం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 02:14 PM

రామన్నపేట లో 1,576 కేసులకు పరిష్కారం

రామన్నపేట లో 1,576 కేసులకు పరిష్కారం

రామన్నపేట లో 1,576 కేసులకు పరిష్కారం
13-09-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా రామన్నపేట కోర్టుల పరిధిలో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.సబిత ఆధ్వర్యంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

లోక్‌ అదాలత్‌లో 77 క్రిమినల్‌, 3 సివిల్‌, 6 బ్యాంకు ప్రీ–లిటిగేషన్‌, 735 ఈ–పెట్టి, 755 డీడీ కేసులు.. మొత్తం 1,576 కేసులు పరిష్కరించారు. బ్యాంకు ప్రీ–లిటిగేషన్‌ కేసులకు సంబంధించి రూ.1,09,870, ఈ–పెట్టి కేసులకు సంబంధించి రూ.7,350 మొత్తాన్ని పరిష్కరించారు.

కేసుల పరిష్కారంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు పరస్పర అంగీకారంతో వివాదాలకు సత్వర పరిష్కారం లభించిందని న్యాయమూర్తులు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి శిరీష, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ దంతూరి సత్తయ్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు, బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట లో 1,576 కేసులకు పరిష్కారం

Article Image

రామన్నపేట: జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా రామన్నపేట కోర్టుల పరిధిలో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.సబిత ఆధ్వర్యంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

లోక్‌ అదాలత్‌లో 77 క్రిమినల్‌, 3 సివిల్‌, 6 బ్యాంకు ప్రీ–లిటిగేషన్‌, 735 ఈ–పెట్టి, 755 డీడీ కేసులు.. మొత్తం 1,576 కేసులు పరిష్కరించారు. బ్యాంకు ప్రీ–లిటిగేషన్‌ కేసులకు సంబంధించి రూ.1,09,870, ఈ–పెట్టి కేసులకు సంబంధించి రూ.7,350 మొత్తాన్ని పరిష్కరించారు.

కేసుల పరిష్కారంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు పరస్పర అంగీకారంతో వివాదాలకు సత్వర పరిష్కారం లభించిందని న్యాయమూర్తులు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి శిరీష, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ దంతూరి సత్తయ్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు, బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News