Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ ఉత్సవాలకు సన్నద్ధం.. నగర సమితి కార్యాలయం ప్రారంభం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 01:08 PM

రామగిరి ముత్యాలమ్మకు ఘనంగా రథోత్సవం.

రామగిరి ముత్యాలమ్మకు ఘనంగా రథోత్సవం.

రామగిరి ముత్యాలమ్మకు ఘనంగా రథోత్సవం.
13-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన భక్తజనం.


నల్లగొండ: పట్టణంలోని రామగిరి ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి రథోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. రథోత్సవాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని భక్తులు ప్రత్యేకంగా ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆలయ పూజారి వెలిజాల అంజయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముత్యాలమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉందన్నారు. తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నల్లగొండ పట్టణ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రథోత్సవాన్ని తిలకించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Sthanikam

రామగిరి ముత్యాలమ్మకు ఘనంగా రథోత్సవం.

Article Image

భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన భక్తజనం.


నల్లగొండ: పట్టణంలోని రామగిరి ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి రథోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. రథోత్సవాన్ని తిలకించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని భక్తులు ప్రత్యేకంగా ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆలయ పూజారి వెలిజాల అంజయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముత్యాలమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉందన్నారు. తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నల్లగొండ పట్టణ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రథోత్సవాన్ని తిలకించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News