చౌటుప్పల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మట్టి గణపతి విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షురాలు నల్ల భూమిక మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మట్టి విగ్రహాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం సంతోషకరమన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారు చేసిన గణపతి విగ్రహాల వినియోగాన్ని తగ్గించి, మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సంస్థ సభ్యులు యాట మహేందర్, బడుగు హరినాథ్, నల్ల ఉదయ్ కిరణ్, రాపోలు ఉదయ్ శంకర్, పోలేపల్లి మహేష్, బొబ్బిల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి