Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ ఉత్సవాలకు సన్నద్ధం.. నగర సమితి కార్యాలయం ప్రారంభం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 01:07 PM

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు.

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు.

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు.
13-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద ఎంఎస్ న్యూస్ 24X7 ఛానల్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఛానల్ ఎండీ గుంటోజు మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ శివరాం రెడ్డి మట్టి గణపతుల పంపిణీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. సహజమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణహితమైన మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ విజయభాయి, ఎంఎస్ న్యూస్ 24X7 ఎండీ గుంటోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు.

Article Image

నల్లగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద ఎంఎస్ న్యూస్ 24X7 ఛానల్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఛానల్ ఎండీ గుంటోజు మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ శివరాం రెడ్డి మట్టి గణపతుల పంపిణీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. సహజమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణహితమైన మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ విజయభాయి, ఎంఎస్ న్యూస్ 24X7 ఎండీ గుంటోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News