Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ ఉత్సవాలకు సన్నద్ధం.. నగర సమితి కార్యాలయం ప్రారంభం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 01:13 PM

మాక్‌ అసెంబ్లీతో శాసనసభను అపహాస్యం చేయడం సరికాదు

మాక్‌ అసెంబ్లీతో శాసనసభను అపహాస్యం చేయడం సరికాదు

మాక్‌ అసెంబ్లీతో శాసనసభను అపహాస్యం చేయడం సరికాదు
13-09-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్‌ మండల నాయకుడు గోలి నరేష్‌ మండిపాటు.


చిట్యాల: శాసనసభ నుంచి సస్పెండ్‌ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాక్‌ అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీ సమావేశాలను, స్పీకర్‌ పదవిని అపహాస్యం చేయడం సరికాదని కాంగ్రెస్‌ మండల నాయకుడు గోలి నరేష్‌ రజక అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ఇటీవల అసెంబ్లీ గేటు వద్ద నిరసన సందర్భంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు.. మాక్‌ అసెంబ్లీ నిర్వహించి స్పీకర్‌ను వెక్కిరిస్తూ, ముఖ్యమంత్రి హోదాను కించపరిచేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ గ్రామ శాఖ కార్యదర్శి తాటికొండ సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకుడు అంశాల శ్రవణ్‌కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఉమ్మెత్తల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

మాక్‌ అసెంబ్లీతో శాసనసభను అపహాస్యం చేయడం సరికాదు

Article Image

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్‌ మండల నాయకుడు గోలి నరేష్‌ మండిపాటు.


చిట్యాల: శాసనసభ నుంచి సస్పెండ్‌ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాక్‌ అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీ సమావేశాలను, స్పీకర్‌ పదవిని అపహాస్యం చేయడం సరికాదని కాంగ్రెస్‌ మండల నాయకుడు గోలి నరేష్‌ రజక అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ఇటీవల అసెంబ్లీ గేటు వద్ద నిరసన సందర్భంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు.. మాక్‌ అసెంబ్లీ నిర్వహించి స్పీకర్‌ను వెక్కిరిస్తూ, ముఖ్యమంత్రి హోదాను కించపరిచేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ గ్రామ శాఖ కార్యదర్శి తాటికొండ సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకుడు అంశాల శ్రవణ్‌కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఉమ్మెత్తల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News