Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 10:00 PM

వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్

వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్

వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్
13-09-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: లోతట్టు ప్రాంతాల్లో చైర్‌పర్సన్ పర్యటన

పట్టణంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పురపాలక సంఘ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కోరారు. రాత్రి కురిసిన వర్షానికి 12వ వార్డు గాంధీ పార్క్ వెనకాల ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని మూడు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో, సమాచారం అందుకున్న చైర్‌పర్సన్.. స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత ఇళ్లలో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ​వరద అత్యవసర సహాయక చర్యల కోసం రెండు జేసీబీలను అందుబాటులో ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, అధికారులను స్పష్టంగా ఆదేశించారు.​14వ వార్డు రూబీ ఇంజనీరింగ్ వర్క్స్ వెనకాల నిలిచిన వర్షపు నీటిని జేసీబీతో ఘాతు తీసి సర్వీస్ రోడ్డులోని పెద్ద నాలాలోకి మళ్లించారు. ​తంగడపల్లి రోడ్డు రహదారిపై నిలిచిన నీటిని నాగులకుంటలోకి పంపించేలా మార్గం సుగమం చేశారు.హనుమాన్ నగర్ లక్కారం నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి ప్రస్తుతం ఉన్న మ్యాన్ హోల్ సరిపోకపోవడంతో, భవిష్యత్తులో ఈ నీటిని వేరే మార్గానికి మళ్లించేలా ఏర్పాట్లు చేస్తామని స్థానిక నాయకుడు కామిశెట్టి భాస్కర్‌కు హామీ ఇచ్చారు. ​వలిగొండ రోడ్డు కల్వర్టు వద్ద నిలిచిన నీటిని పక్కనే ఉన్న మోరీలోకి మళ్లించారు. ​డ్రైనేజీ పూడికతీత జయభూమి వెంచర్ నుంచి తాలసింగారం చెరువు వరకు ఉన్న పెద్ద డ్రైనేజీలో పూడికతీత పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ​ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ఎస్.ఐ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణు కుమార్, టీడబ్ల్యూఐ సంతోష్, నాయకులు ఉడుగు రమేష్, బత్తుల విప్లవ్, జవాన్లు అంజయ్య, నరసింహ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: లోతట్టు ప్రాంతాల్లో చైర్‌పర్సన్ పర్యటన

పట్టణంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పురపాలక సంఘ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కోరారు. రాత్రి కురిసిన వర్షానికి 12వ వార్డు గాంధీ పార్క్ వెనకాల ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని మూడు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో, సమాచారం అందుకున్న చైర్‌పర్సన్.. స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత ఇళ్లలో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ​వరద అత్యవసర సహాయక చర్యల కోసం రెండు జేసీబీలను అందుబాటులో ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, అధికారులను స్పష్టంగా ఆదేశించారు.​14వ వార్డు రూబీ ఇంజనీరింగ్ వర్క్స్ వెనకాల నిలిచిన వర్షపు నీటిని జేసీబీతో ఘాతు తీసి సర్వీస్ రోడ్డులోని పెద్ద నాలాలోకి మళ్లించారు. ​తంగడపల్లి రోడ్డు రహదారిపై నిలిచిన నీటిని నాగులకుంటలోకి పంపించేలా మార్గం సుగమం చేశారు.హనుమాన్ నగర్ లక్కారం నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి ప్రస్తుతం ఉన్న మ్యాన్ హోల్ సరిపోకపోవడంతో, భవిష్యత్తులో ఈ నీటిని వేరే మార్గానికి మళ్లించేలా ఏర్పాట్లు చేస్తామని స్థానిక నాయకుడు కామిశెట్టి భాస్కర్‌కు హామీ ఇచ్చారు. ​వలిగొండ రోడ్డు కల్వర్టు వద్ద నిలిచిన నీటిని పక్కనే ఉన్న మోరీలోకి మళ్లించారు. ​డ్రైనేజీ పూడికతీత జయభూమి వెంచర్ నుంచి తాలసింగారం చెరువు వరకు ఉన్న పెద్ద డ్రైనేజీలో పూడికతీత పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ​ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ఎస్.ఐ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణు కుమార్, టీడబ్ల్యూఐ సంతోష్, నాయకులు ఉడుగు రమేష్, బత్తుల విప్లవ్, జవాన్లు అంజయ్య, నరసింహ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News