వినాయకుని ఆకారంలో కూర్చొని విద్యార్థుల సందేశాత్మక ప్రదర్శన
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని తేజ టాలెంట్ పాఠశాల విద్యార్థులు ఆదివారం వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా విద్యార్థులు వినాయకుని ఆకారంలో కూర్చొని ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వినాయక చవితి పండుగ విశిష్టత, ఆధ్యాత్మికత, ప్రశాంతతతో కూడిన జీవనం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, వారి మాటను పాటించడం వంటి విలువలను తెలియజేశారు. పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక సందేశాలను చిన్నతనం నుంచే విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు.వినూత్న ప్రదర్శన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వి. రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్, సెక్రటరీ సంతోష్ కుమార్, ఇన్చార్జి రేణుక, నవ్య, పీఈటీ రాంబాబు, గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి