Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 10:03 PM

12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
13-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పర్యావరణ పరిరక్షణలో భాగంగా చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 12వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత్ సేవా సహకార ఫోరం చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ సౌజన్యంతో, ఫోరం ట్రస్ట్ మెంబర్ బొబ్బిళ్ళ మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

​స్థానిక కౌన్సిలర్ చిరంజీవి, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బొంగు జంగయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు విగ్రహాలను అందజేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా కష్టకాలం నుంచి భారత్ సేవా సహకార ఫోరం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి గణపతులనే పూజించాలని పిలుపునిచ్చారు. సామాజిక స్పృహ కల్పిస్తూ ముందుకెళ్తున్న సంస్థ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్‌కు 12వ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీ అధ్యక్షుడు పెద్దగోని రమేష్ గౌడ్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ధర్మకర్తలు వర్కాల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, వార్డు నాయకులు బెదరకోట ఈశ్వర్, రమేష్, కనకమోని శ్రీనివాస్, చెవ్వగొని వెంకటేష్ గౌడ్, జక్కర్తి శేఖర్, తమ్మకొండ రాజు, అల్లి కృష్ణ, తమ్మకొండ శ్రీను, బుంగపట్ల రవి, జక్కర్తి సుధా, బొబ్బిళ్ళ సామ్రాట్, కడలి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Article Image

పర్యావరణ పరిరక్షణలో భాగంగా చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని 12వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత్ సేవా సహకార ఫోరం చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ సౌజన్యంతో, ఫోరం ట్రస్ట్ మెంబర్ బొబ్బిళ్ళ మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

​స్థానిక కౌన్సిలర్ చిరంజీవి, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బొంగు జంగయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు విగ్రహాలను అందజేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా కష్టకాలం నుంచి భారత్ సేవా సహకార ఫోరం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి గణపతులనే పూజించాలని పిలుపునిచ్చారు. సామాజిక స్పృహ కల్పిస్తూ ముందుకెళ్తున్న సంస్థ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్‌కు 12వ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీ అధ్యక్షుడు పెద్దగోని రమేష్ గౌడ్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ధర్మకర్తలు వర్కాల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, వార్డు నాయకులు బెదరకోట ఈశ్వర్, రమేష్, కనకమోని శ్రీనివాస్, చెవ్వగొని వెంకటేష్ గౌడ్, జక్కర్తి శేఖర్, తమ్మకొండ రాజు, అల్లి కృష్ణ, తమ్మకొండ శ్రీను, బుంగపట్ల రవి, జక్కర్తి సుధా, బొబ్బిళ్ళ సామ్రాట్, కడలి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News