Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 10:04 PM

మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
13-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో ఉచిత విగ్రహాల పంపిణీ

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో, చౌటుప్పల్ సుధా పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అవ్వారు శ్రీనివాస్ ప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు విగ్రహాలను అందజేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత పదేళ్లుగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందలాది మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ​ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు, అధ్యక్షుడు ఎండీ అతహర్ పాషా, ట్రెజరర్ బత్తిని రఘు, సభ్యులు గోశిక కరుణాకర్, కాసుల వెంకటేశం, కొసనం రామ్‌రెడ్డి, పోలోజు శ్రీనివాసచారి, కటకం ప్రశాంత్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, చిలువేరు మంగయ్య, వనం రాజు, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, అయ్యాడపు ప్రతాపరెడ్డి, సురోజు సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

Article Image

చౌటుప్పల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో ఉచిత విగ్రహాల పంపిణీ

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో, చౌటుప్పల్ సుధా పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అవ్వారు శ్రీనివాస్ ప్రసాద్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు విగ్రహాలను అందజేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత పదేళ్లుగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందలాది మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ​ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు, అధ్యక్షుడు ఎండీ అతహర్ పాషా, ట్రెజరర్ బత్తిని రఘు, సభ్యులు గోశిక కరుణాకర్, కాసుల వెంకటేశం, కొసనం రామ్‌రెడ్డి, పోలోజు శ్రీనివాసచారి, కటకం ప్రశాంత్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, చిలువేరు మంగయ్య, వనం రాజు, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, అయ్యాడపు ప్రతాపరెడ్డి, సురోజు సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News