రాయికోడ్ మండలం చేర్లరాయిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఏడు రోజులుగా నిర్వహించిన సప్తాహ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆంజనేయ స్వామి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించి భక్తులు దైవనామస్మరణ, భజనలు, కీర్తనల్లో పాల్గొన్నారు.ఏడు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కీర్తనకారులు రాత్రివేళల్లో భజనలు, కీర్తనలతో భక్తులను అలరించారు.ముగింపు వేడుకల్లో పల్లకి సేవ, ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామంలోని ఆలయాల వద్ద కాషాయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాశి బస్వరాజ్ పాటిల్, ఉపసర్పంచ్ అంజయ్య, మాజీ సర్పంచ్ అడివయ్య బీరయ్య, మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి అశోక్తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 13, 2026 08:57 PM
చేర్లరాయిపల్లిలో ఘనంగా సప్తాహ వేడుకల ముగింపు
చేర్లరాయిపల్లిలో ఘనంగా సప్తాహ వేడుకల ముగింపు
13-09-2026
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
రాయికోడ్ మండలం చేర్లరాయిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఏడు రోజులుగా నిర్వహించిన సప్తాహ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆంజనేయ స్వామి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించి భక్తులు దైవనామస్మరణ, భజనలు, కీర్తనల్లో పాల్గొన్నారు.ఏడు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కీర్తనకారులు రాత్రివేళల్లో భజనలు, కీర్తనలతో భక్తులను అలరించారు.ముగింపు వేడుకల్లో పల్లకి సేవ, ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామంలోని ఆలయాల వద్ద కాషాయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాశి బస్వరాజ్ పాటిల్, ఉపసర్పంచ్ అంజయ్య, మాజీ సర్పంచ్ అడివయ్య బీరయ్య, మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి అశోక్తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి