Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణహిత వినాయకులే ముద్దు.. మట్టి విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 01:13 PM

పర్యావరణహిత వినాయకులే ముద్దు.. మట్టి విగ్రహాల పంపిణీ

పర్యావరణహిత వినాయకులే ముద్దు.. మట్టి విగ్రహాల పంపిణీ

పర్యావరణహిత వినాయకులే ముద్దు.. మట్టి విగ్రహాల పంపిణీ
14-09-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని లైన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ రాజకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్ ఆచార్య, అధ్యక్షుడు సాయి సంగమేశ్వర అన్నారు. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పండుగలో ప్రకృతికి హాని కలిగించని వస్తువులను వినియోగించాలని సూచించారు. పంచభూతాలను కాలుష్యం చేయడం మానవ ప్రగతికి విరుద్ధమని, ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రకృతి పరిరక్షణను ధ్యేయంగా చేసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని కోరారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి పాండురంగ రెడ్డి, సభ్యులు రాజేశ్వర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణహిత వినాయకులే ముద్దు.. మట్టి విగ్రహాల పంపిణీ

Article Image

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని లైన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ రాజకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్ ఆచార్య, అధ్యక్షుడు సాయి సంగమేశ్వర అన్నారు. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పండుగలో ప్రకృతికి హాని కలిగించని వస్తువులను వినియోగించాలని సూచించారు. పంచభూతాలను కాలుష్యం చేయడం మానవ ప్రగతికి విరుద్ధమని, ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రకృతి పరిరక్షణను ధ్యేయంగా చేసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని కోరారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి పాండురంగ రెడ్డి, సభ్యులు రాజేశ్వర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News