Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణహిత వినాయకులే ముద్దు.. మట్టి విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 02:19 PM

ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి. 80 వసంతాల ఎస్‌టీయూ-టీఎస్ వైభవోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి. 80 వసంతాల ఎస్‌టీయూ-టీఎస్ వైభవోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి. 80 వసంతాల ఎస్‌టీయూ-టీఎస్ వైభవోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.
14-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: ఉపాధ్యాయులు సమాజ మనుగడకు తోడ్పడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేయాలని గౌరవ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు. 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్‌టీయూ-టీఎస్ వైభవోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్‌టీయూ-టీఎస్ అధ్యక్షులు ఇండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కల్లూరి రమేష్, రాష్ట్ర కార్యదర్శి బకనగారి జంగయ్య, ఏఐఎస్‌టీఎఫ్ కౌన్సిల్ మెంబర్ బొమ్మగాని నాగభూషణం, ఎస్‌టీయూ నాయకులు నరసింహ, వెంకటేశ్వర్లు, ఉయ్యాల బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి. 80 వసంతాల ఎస్‌టీయూ-టీఎస్ వైభవోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం.

Article Image

నకిరేకల్: ఉపాధ్యాయులు సమాజ మనుగడకు తోడ్పడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేయాలని గౌరవ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు. 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్‌టీయూ-టీఎస్ వైభవోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్‌టీయూ-టీఎస్ అధ్యక్షులు ఇండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కల్లూరి రమేష్, రాష్ట్ర కార్యదర్శి బకనగారి జంగయ్య, ఏఐఎస్‌టీఎఫ్ కౌన్సిల్ మెంబర్ బొమ్మగాని నాగభూషణం, ఎస్‌టీయూ నాయకులు నరసింహ, వెంకటేశ్వర్లు, ఉయ్యాల బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News