సమాజంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువత ఉన్నత చదువులు చదువుకొని ఎలాంటి ఉద్యోగం లభించక నిరుద్యోగంతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 19 న కోదాడ పట్టణంలోని సి సి రెడ్డి కాన్వెంట్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి కోదాడ సి సి కాన్వెంట్ లో ఈ నెల 19 న నిర్వహించే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో ఐటి, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 250 నుండి 300 పై చిలుకు కంపెనీలు హాజరుకానుండగా, సుమారు 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పక్కన ఉన్న ఖమ్మం జిల్లా నుండి నిరుద్యోగ యువత ఇట్టి ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అలాగే సూర్యాపేట కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి నిరుద్యోగులు అత్యధికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉదయం 9 గంటల నుండి రాత్రి 9:00 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఇంటర్వ్యూలలో ఉద్యోగం సంపాదించిన వారికి వెంటనే ఆర్డర్స్ ఇవ్వబడుతాయని అన్నారు.తదుపరి మంత్రి జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించి క్యూ ఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అభ్యర్థులకు ముందుగానే ఏ కంపెనీకి అర్హత ఉందో తెలిపే విధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని అన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,వివిధ కంపెనీల ప్రతినిధులు కోదాడ హుజూర్నగర్ తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19 న కోదాడ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 19 న కోదాడ లో పెద్ద ఎత్తున జాబ్ మేళా
Harish reporter
సమాజంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువత ఉన్నత చదువులు చదువుకొని ఎలాంటి ఉద్యోగం లభించక నిరుద్యోగంతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 19 న కోదాడ పట్టణంలోని సి సి రెడ్డి కాన్వెంట్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి కోదాడ సి సి కాన్వెంట్ లో ఈ నెల 19 న నిర్వహించే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో ఐటి, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 250 నుండి 300 పై చిలుకు కంపెనీలు హాజరుకానుండగా, సుమారు 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పక్కన ఉన్న ఖమ్మం జిల్లా నుండి నిరుద్యోగ యువత ఇట్టి ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అలాగే సూర్యాపేట కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి నిరుద్యోగులు అత్యధికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉదయం 9 గంటల నుండి రాత్రి 9:00 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఇంటర్వ్యూలలో ఉద్యోగం సంపాదించిన వారికి వెంటనే ఆర్డర్స్ ఇవ్వబడుతాయని అన్నారు.తదుపరి మంత్రి జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించి క్యూ ఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అభ్యర్థులకు ముందుగానే ఏ కంపెనీకి అర్హత ఉందో తెలిపే విధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని అన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,వివిధ కంపెనీల ప్రతినిధులు కోదాడ హుజూర్నగర్ తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి