వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీస్సులు కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, విజయాలు చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మరోసారి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి