ఆర్మూర్: మహిళలు, విద్యార్థినుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్టీజింగ్, వేధింపులకు పాల్పడినా వెంటనే షీ టీంకు సమాచారం ఇవ్వాలని సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు విఘ్నేష్, సుకన్య సూచించారు. గురువారం వన్నెల్ బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్ క్రైమ్, మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
భయపడొద్దు.. సమాచారం ఇవ్వండి.
ఈవ్టీజింగ్, వేధింపులకు గురైన విద్యార్థినులు, మహిళలు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు, షీ టీం 8712659795 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
క్యూఆర్ కోడ్తో ఫిర్యాదు.
క్యూఆర్ కోడ్ ద్వారా షీ టీంకు ఫిర్యాదు చేసే విధానాన్ని విద్యార్థినులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డి. సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి