ప్రజాపాలన దినోత్సవాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రజాపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించి రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇదే సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను పంపిణీ చేశారు.
తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రీన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సంగారెడ్డి వారి సహకారంతో సుమారు రూ.13.10 లక్షల విలువైన 21 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను దివ్యాంగులకు అందజేశారు.ఈ పరికరాలు దివ్యాంగులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాండు, సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సహాయ పరికరాలు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు సహాయ పరికరాలు
Krishna
ప్రజాపాలన దినోత్సవాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రజాపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించి రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇదే సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను పంపిణీ చేశారు.
తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రీన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సంగారెడ్డి వారి సహకారంతో సుమారు రూ.13.10 లక్షల విలువైన 21 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను దివ్యాంగులకు అందజేశారు.ఈ పరికరాలు దివ్యాంగులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాండు, సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి