Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 02:35 PM

త్యాగధనుల స్ఫూర్తితో ప్రజాపాలనను బలోపేతం చేద్దాం

త్యాగధనుల స్ఫూర్తితో ప్రజాపాలనను బలోపేతం చేద్దాం

త్యాగధనుల స్ఫూర్తితో ప్రజాపాలనను బలోపేతం చేద్దాం
17-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజల హక్కులు, సంక్షేమాన్ని కాపాడటమే లక్ష్యం

డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (రెడ్‌హౌస్)లో బుధవారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, అనేక పోరాటాల ఫలితంగా రాచరిక పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టానికి సెప్టెంబర్‌ 17 ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఆ చారిత్రక నేపథ్యాన్ని స్మరించుకుంటూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల గౌరవం, హక్కులు, సంక్షేమాన్ని కాపాడుతూ ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, సమానత్వంతో కూడిన ప్రజాపాలనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.


కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌తో పాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

త్యాగధనుల స్ఫూర్తితో ప్రజాపాలనను బలోపేతం చేద్దాం

Article Image

ప్రజల హక్కులు, సంక్షేమాన్ని కాపాడటమే లక్ష్యం

డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (రెడ్‌హౌస్)లో బుధవారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, అనేక పోరాటాల ఫలితంగా రాచరిక పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టానికి సెప్టెంబర్‌ 17 ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఆ చారిత్రక నేపథ్యాన్ని స్మరించుకుంటూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల గౌరవం, హక్కులు, సంక్షేమాన్ని కాపాడుతూ ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, సమానత్వంతో కూడిన ప్రజాపాలనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.


కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌తో పాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News