Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిమజ్జనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఆరుగురు విద్యార్థులు మృతి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 11:23 PM

20న 'వెంటాడే కళలు.. వెనుకబడిన కులాలు' పుస్తకావిష్కరణ

20న 'వెంటాడే కళలు.. వెనుకబడిన కులాలు' పుస్తకావిష్కరణ

20న 'వెంటాడే కళలు.. వెనుకబడిన కులాలు' పుస్తకావిష్కరణ
16-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అధ్యాయంగా నిలచిన "వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు" సంకలనానికి కోదాడ జన్మస్థలి కావడం గర్వకారణంగా ఉందని పుస్తక సంపాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఓనమాలు దిద్దించి నడక నేర్పిన నడిగూడెం, సామాజిక స్పృహనందించిన కోదాడ మట్టిస్ఫూర్తితోనే "వెంటాడే కలాలు" సంకలనం తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న జరిగే బీసీ కవుల అలాయ్ బలాయ్ "వెంటాడే కలాలు" పుస్తక రజతోత్సవ సందర్భంగా కోదాడలో బుధవారం నాడు రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, వేముల వెంకటేశ్వర్లు, బాణాల వసంత, సిరికొండ శ్రీనివాస్, పుప్పాల కృష్ణమూర్తి, సరికొండ నరసింహారాజు తదితరుల నేతృత్వంలో రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ... 2001లో పల్లెలు చిద్రమై, కులవృత్తులు ధ్వంసమై, బడుగుల బతుకులు అల్లకల్లోలమైపోతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో "వెంటాడే కలాలు" సంకలనం తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో 23 మంది బీసీ కవులు తమ ఆత్మకథనాత్మక వ్యధల్ని ఆవిష్కరించారని అన్నారు. చారిత్రాత్మకమైన రాష్ట్రస్థాయి దళిత సాహిత్య సదస్సుకి 1995లో కోదాడ పట్టణమే ఆతిథ్యమిచ్చి నిర్వహించిందని గుర్తు చేశారు. 1935 ల నుంచే నడిగూడెంకు గొప్ప సాహిత్య చరిత్ర ఉందన్నారు. రాజా నాయని వెంకట రంగారావు నడిగూడెం సంస్థానం నుంచే విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి పేరున 60 పుస్తకాలు వెలువరించడం జరిగిందని సింహావలోకనం చేశారు. హైదరాబాదులో 20న జరిగే "వెంటాడే కలాలు రజతోత్సవ సభకు" రాష్ట్రం నలుమూలల నుంచి మూడు 300కు పైగా బీసీ కవులు హాజరవుతారని జూలూరు గౌరీశంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు కవి జూలూరు గౌరీశంకర్ ను త్రివేణి, వాగ్దేవి, రేస్ కళాశాలల చైర్మన్ బాణాల వసంత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో... రామ నరసయ్య, హరి కిషన్, పొట్ట జగన్నాథం, షేక్ మీరా,డి.ఎన్. స్వామి, జి.ఎల్.ఎన్ రెడ్డి, జూలూరు వీరభద్రం, బాదేరాము,కొలిచలం శ్రీనివాస్, త్రివేణి డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు..

Sthanikam

20న 'వెంటాడే కళలు.. వెనుకబడిన కులాలు' పుస్తకావిష్కరణ

Article Image

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అధ్యాయంగా నిలచిన "వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు" సంకలనానికి కోదాడ జన్మస్థలి కావడం గర్వకారణంగా ఉందని పుస్తక సంపాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఓనమాలు దిద్దించి నడక నేర్పిన నడిగూడెం, సామాజిక స్పృహనందించిన కోదాడ మట్టిస్ఫూర్తితోనే "వెంటాడే కలాలు" సంకలనం తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న జరిగే బీసీ కవుల అలాయ్ బలాయ్ "వెంటాడే కలాలు" పుస్తక రజతోత్సవ సందర్భంగా కోదాడలో బుధవారం నాడు రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, వేముల వెంకటేశ్వర్లు, బాణాల వసంత, సిరికొండ శ్రీనివాస్, పుప్పాల కృష్ణమూర్తి, సరికొండ నరసింహారాజు తదితరుల నేతృత్వంలో రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ... 2001లో పల్లెలు చిద్రమై, కులవృత్తులు ధ్వంసమై, బడుగుల బతుకులు అల్లకల్లోలమైపోతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో "వెంటాడే కలాలు" సంకలనం తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో 23 మంది బీసీ కవులు తమ ఆత్మకథనాత్మక వ్యధల్ని ఆవిష్కరించారని అన్నారు. చారిత్రాత్మకమైన రాష్ట్రస్థాయి దళిత సాహిత్య సదస్సుకి 1995లో కోదాడ పట్టణమే ఆతిథ్యమిచ్చి నిర్వహించిందని గుర్తు చేశారు. 1935 ల నుంచే నడిగూడెంకు గొప్ప సాహిత్య చరిత్ర ఉందన్నారు. రాజా నాయని వెంకట రంగారావు నడిగూడెం సంస్థానం నుంచే విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి పేరున 60 పుస్తకాలు వెలువరించడం జరిగిందని సింహావలోకనం చేశారు. హైదరాబాదులో 20న జరిగే "వెంటాడే కలాలు రజతోత్సవ సభకు" రాష్ట్రం నలుమూలల నుంచి మూడు 300కు పైగా బీసీ కవులు హాజరవుతారని జూలూరు గౌరీశంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు కవి జూలూరు గౌరీశంకర్ ను త్రివేణి, వాగ్దేవి, రేస్ కళాశాలల చైర్మన్ బాణాల వసంత ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో... రామ నరసయ్య, హరి కిషన్, పొట్ట జగన్నాథం, షేక్ మీరా,డి.ఎన్. స్వామి, జి.ఎల్.ఎన్ రెడ్డి, జూలూరు వీరభద్రం, బాదేరాము,కొలిచలం శ్రీనివాస్, త్రివేణి డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News