గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా కార్యక్రమాలు
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నాగోల్, సెప్టెంబర్ 16 గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సీపీ బి.సుమతి ఐపీఎస్ చేపట్టిన ‘గణేష్ సురక్ష సంకల్ప్–2026’లో భాగంగా గణేష్ మండపాల వద్ద డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగోల్ ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో బ్లైండ్స్ కాలనీ ఎస్హెచ్జీ మహిళలతో కలిసి డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయని అధికారులు వివరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ వి.శ్రీనివాసులు, టీఎస్ న్యాబ్ ఈగల్ టీమ్స్ డీఎస్పీ శ్రీనివాస్, నాగోల్ ఎస్ఐ ఉమాతో పాటు ఎస్హెచ్జీ సభ్యులు ఉమా, పుష్ప, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి