విద్యార్థుల భద్రతపై ఆందోళన.. చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురంలోని ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో మద్యం సేవించిన అనంతరం వదిలివెళ్లిన ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయి.
పాఠశాల ప్రాంగణంలో మద్యం బాటిళ్లు ఉండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థులు రాకపోకలు సాగించే పాఠశాల ఆవరణలో మద్యం సేవించడం, బాటిళ్లను అక్కడే వదిలివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా సంబంధిత అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి