బాధితులకు చెక్కులు అందజేసిన సర్పంచ్ గౌరి శ్రీనివాస్ గౌడ్
అనారోగ్యాల బారిన పడిన నిరుపేదల పాలిట సీఎం సహాయనిధి వరం లాంటిదని సర్పంచ్ సురుగు గౌరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన గుడ్డేటి మమతకు రూ.34 వేలు, రావిరాల అంజయ్యకు రూ.21 వేల చొప్పున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం బాధితులకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ, ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తోందన్నారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, ఆదిమూలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి