విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలి: కౌన్సిలర్ పాక చిరంజీవి
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రాంనగర్లో ‘రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సర్వత్రా శుభాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి