యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గల్లీ యూత్ సభ్యులకు స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ గణపతి విగ్రహాన్ని బహుకరించారు.సోమవారం విగ్రహ దాత డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ కుటుంబ సమేతంగా గల్లీ యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి హాజరై ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు.
అనంతరం గల్లీ యూత్ సభ్యులతో పాటు ఆగు మల్లయ్య–లక్ష్మమ్మ, హాగు లింగస్వామి–పావని దంపతులు పూజల్లో పాల్గొన్నారు.గ్రామ ప్రజలు, యువత సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని గణపతిని ప్రార్థించారు. నవరాత్రుల సందర్భంగా గల్లీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి