అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో తొలి పూజా కార్యక్రమం
స్వామివారికి పూలదండ వేసి పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు రామ్నగర్ కాలనీలో అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గణేష్ నవరాత్రుల మొదటి పూజా కార్యక్రమాన్ని సోమవారం స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూలదండ సమర్పించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు బత్తుల వాణి విప్లవ్ గౌడ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, పాక చిరంజీవి, బుడ్డ సురేష్, సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, వ్యాపారవేత్త మంచి కంటి భాస్కర్ గుప్తలు పాల్గొని వినాయకుడికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ యూత్ అధ్యక్షులు చెవగొని వెంకటేష్ గౌడ్, ప్రతినిధులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, తోర్పునూరి మల్లేష్ గౌడ్, తోర్పునూరి బాబు గౌడ్, తోర్పునూరి నరసింహ గౌడ్, వర్కాల వెంకటేష్, తోర్పునూరి జంగయ్య, చెరుకు శీను గౌడ్, చెరుకు అచ్చయ్య గౌడ్, పోలోజు విశ్వరూపాచారి, కొరిమి శేఖర్ ముదిరాజ్, చెవగొని ఇస్తారి, తోర్పునూరి చంద్రయ్య గౌడ్, ఉష్కాగుల జంగయ్య గౌడ్, మోగుదాల రాములు గౌడ్, మార్గం నరసింహ యాదవ్, తోర్పునూరి రవి గౌడ్, ఎర్రసాని శీను యాదవ్, తోర్పునూరి చిన్నమల్లేష్ గౌడ్, ఉష్కాగుల వెంకటేష్ గౌడ్, చెవగొని రమేష్ గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, కళ్లెం నాగరాజు గౌడ్, వర్కాల జయరాం గౌడ్, చెరుకు రాము గౌడ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, తోర్పునూరి సాయి గౌడ్, చెవగొని గణేష్ గౌడ్, సన్నిద్ చారి, చెవగొని శ్రావణ్ గౌడ్, ఊదరి మహేష్, తోర్పునూరి శివ గౌడ్, చెరుకు చైతన్య బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి