మల్కాజిగిరి: పోలీసుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమన్వయంతో పనిచేయాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి సూచించారు. మంగళవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సీపీ సుమతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఈ సందర్భంగా సీపీ సుమతి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీసుల సంక్షేమం, వారి కుటుంబాల అభ్యున్నతికి అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
నూతన కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాకేష్, రామస్వామి, నీలవేణి, సెక్రటరీ డి. నవీన్ కుమార్, జాయింట్ సెక్రటరీ బాలరాజు, అసిస్టెంట్ సెక్రటరీలు సుబ్బరాజు, పలుగుల శ్రవణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు మల్లేష్, బీరయ్య, విజయ్, రామకృష్ణ గౌడ్, ట్రెజరర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి