హత్యకు దారి తీసిన 5 కీలక అంశాలు
నయీమ్ హత్య కేసు ఛేదన
ఏసీపీ పర్యవేక్షణలో ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేపట్టి నయీమ్ హత్య కేసును ఛేదించారు. కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు, వివాదాల నేపథ్యంలోనే హత్యకు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది.మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి, ఐపీఎస్ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 14న బండ్లగూడలోని సుప్రీం వైన్స్ సమీపంలో నయీమ్పై దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితుల కదలికలపై దృష్టి సారించారు.
ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి.అనురాధ, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో ఏసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణతో ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.కేసులో సయ్యద్ రబ్బానీ, ఓట్ల దినేష్, వోలిపిల్ల మహేష్, రాసుమల్ల సాకేత్, అలకుంట వెంకట్, కొడిగంటి రాఘవేందర్ అలియాస్ రఘు, వల్లపుదాసు చరణ్గౌడ్, మహ్మద్ బద్రుల్లా హుస్సేన్, తొడేటి వెంకటేష్లను అరెస్టు చేశారు.
కనకం ఉమామహేష్, మహ్మద్ ఇస్మాయిల్ జాబీ, భోలే, కార్తీక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి వేట కొడవలి, ఇనుపరాడ్, టయోటా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి