తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో 33 జిల్లాల జిల్లా అధ్యక్షుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. ఫోరం గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ పాల్గొని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులు, సర్పంచులకు గౌరవ వేతనం, బీమా సౌకర్యం, అధికారాల కల్పన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా గర్దాస్ విక్రమ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ నాయకత్వంలో సర్పంచులంతా ఐక్యంగా ఉన్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి