గ్రామాల అభివృద్ధికి వీజీపీపీ ప్రణాళికలు.
భువనగిరి, సెప్టెంబర్ 16 స్థానిక ప్రతినిధి:
గ్రామాల సమగ్ర అభివృద్ధికి వీఎస్జీపీ (వీజీపీపీ ) ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీబీ -జి రామ్ జి పథకం కింద వీజీపీపీ అమలుపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు, టీఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.వీజీపీపీ రూపకల్పన, గ్రామస్థాయి అవసరాల గుర్తింపు, అభివృద్ధి ప్రణాళిక తయారీ, వీబీ -జి రామ్ మార్గదర్శకాల అనుసంధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. నాలుగు ప్రధాన విభాగాల్లో 318 పనులను గుర్తించారు. వాటర్ సెక్యూరిటీ కింద 107, కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 88, రూరల్ లైవ్లీహుడ్ 86, డిజాస్టర్ మిటిగేషన్ కింద 37 పనులు ఉన్నట్లు వివరించారు. యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామానికి సంబంధించిన రిసోర్స్, సోషల్ మ్యాప్ల ద్వారా గ్రామ అవసరాలను గుర్తించి ప్రణాళిక రూపొందించే విధానాన్ని వివరించారు.
శిక్షణలో మాస్టర్ ట్రైనీ బి.రాజశేఖర్ వీజీపీపీ అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి