రామన్నపేట, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలో భూ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలోని తొలి విడతలో నిదానపల్లి, బాసుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాలను భూ సర్వేకు ఎంపిక చేసినట్లు తహసీల్దార్ లాల్ బహదూర్ తెలిపారు.భూ సర్వేలో భాగంగా మంగళవారం నిదానపల్లి గ్రామంలో భూముల హద్దుల నిర్ధారణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల హద్దులను పరిశీలించి, సంబంధిత వివరాలను నమోదు చేశారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రైతులు సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ శోభ, సర్వేయర్ సోనీ, జీపీఓ లక్ష్మి, నిదానపల్లి సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య, బోగారం సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, ఆయా గ్రామాలకు చెందిన రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి