Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 03:36 PM

ప్రజాపాలన దినోత్సవం.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

ప్రజాపాలన దినోత్సవం.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

ప్రజాపాలన దినోత్సవం.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.
17-09-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాలు రెపరెపలాడాయి. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ లాల్‌బహదూర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో రాములు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఏపీవో వెంకన్న, మహిళా సంఘం భవనం వద్ద మహిళా సంఘం అధ్యక్షురాలు ఆకుల మౌనిక, సర్కిల్‌ పోలీస్‌ కార్యాలయం వద్ద సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ కార్యాలయం వద్ద ఎస్‌ఐ గోపతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, ప్రజలు కలిసి జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా కార్యాలయాల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు.

Sthanikam

ప్రజాపాలన దినోత్సవం.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

Article Image

రామన్నపేట: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాలు రెపరెపలాడాయి. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ లాల్‌బహదూర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో రాములు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఏపీవో వెంకన్న, మహిళా సంఘం భవనం వద్ద మహిళా సంఘం అధ్యక్షురాలు ఆకుల మౌనిక, సర్కిల్‌ పోలీస్‌ కార్యాలయం వద్ద సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ కార్యాలయం వద్ద ఎస్‌ఐ గోపతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, ప్రజలు కలిసి జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా కార్యాలయాల్లో దేశభక్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News