పూజలు నిర్వహించిన ముప్పిడి మహేష్ గౌడ్-మౌనిక, మాజీ సర్పంచ్ కాయితి రమేష్ గౌడ్-అలివేల
చౌటుప్పల్ మండల పరిధిలోని పెద్ద కొండూర్ గ్రామంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం పూజా కార్యక్రమంలో ముప్పిడి నరసింహ గౌడ్–ఐలమ్మ కుమారుడు ముప్పిడి మహేష్ గౌడ్–మౌనిక దంపతులతో పాటు, పెద్ద కొండూర్ మాజీ సర్పంచ్ కాయితి రమేష్ గౌడ్–అలివేల దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు జరిపారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. స్వామివారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి