Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 02:31 PM

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం
17-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. నిజాం పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు. చారిత్రక సంఘటనల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు.

Sthanikam

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా విమోచన దినోత్సవం

Article Image

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. నిజాం పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు. చారిత్రక సంఘటనల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News