తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను, నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం సాగిన ఉద్యమాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన, స్వేచ్ఛ కోసం ఎంతోమంది చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాల కల్పన, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజా పాలనలో ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి యండి ఫసియోదీన్ ముక్రం, మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి