Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీటీడీ కల్యాణ మండపం భూమికి హద్దుల నిర్ణయం. న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:38 PM

బాధితులకు భరోసా దక్కేవరకు పోరాడతాం!

బాధితులకు భరోసా దక్కేవరకు పోరాడతాం!

బాధితులకు భరోసా దక్కేవరకు పోరాడతాం!
23-07-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చర్లగూడెం భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి

ఎమ్మాల్యేకు పదవులపై ఉన్న ధ్యాస సమస్యలపై లేదు: బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అభయేందర్

చర్లగూడెం భూనిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వాలు రాక్షస ఆనందం పొందుతున్నాయని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఐతరాజు అభయేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ప్రాజెక్టు వద్ద బీఎస్పీ మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు, చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం ఫ్లోరైడ్ బారినపడి నలిగిపోతుంటే.. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల ఆవేదన కంటే మంత్రి పదవి సాధించడమే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొట్ట శివ, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుక్క రాములు, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్, నాయకులు పల్లేటి రతివ, ఈద నరేష్, సురేష్, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధితులకు భరోసా దక్కేవరకు పోరాడతాం!

Article Image

చర్లగూడెం భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి

ఎమ్మాల్యేకు పదవులపై ఉన్న ధ్యాస సమస్యలపై లేదు: బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అభయేందర్

చర్లగూడెం భూనిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వాలు రాక్షస ఆనందం పొందుతున్నాయని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఐతరాజు అభయేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ప్రాజెక్టు వద్ద బీఎస్పీ మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు, చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం ఫ్లోరైడ్ బారినపడి నలిగిపోతుంటే.. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల ఆవేదన కంటే మంత్రి పదవి సాధించడమే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొట్ట శివ, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుక్క రాములు, నారాయణపురం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్, నాయకులు పల్లేటి రతివ, ఈద నరేష్, సురేష్, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News