PRINT TIME: April 06, 2026 10:27 PM
కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్కే మల్లికార్జున నియామకం
కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్కే మల్లికార్జున నియామకం
April 06, 2026 08:23 PM
30 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
పెనుకొండ:రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడిగా నియమితులైన రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఎస్కే మల్లికార్జున, పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు.
ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులు, సభ్యులు కూడా హాజరై మల్లికార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవితమ్మ ఆకాంక్షించారు.
అనంతరం ఎస్కే మల్లికార్జున మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కురుబ సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి