మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు నివాసంపై ఇటీవల తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడటమే కాకుండా అక్రమ కేసులో అరెస్టు చేయడంతో 18 రోజులు జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలైన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్, మాజీ ఉపముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో కలిసి విజయవాడలో అంబటి రాంబాబును పరామర్శించి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆమదాలవలస ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి