శ్రీ సత్యసాయి జిల్లా – పెనుకొండ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో నేడు చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల అమరావతి అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. రాజకీయ స్వార్థాల కోసం రెండు రాజధానుల పేరుతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని విమర్శించారు.ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా ముందడుగు వేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రంగేపల్లి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.
PRINT TIME: August 25, 2026 02:13 AM
అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ
అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ
28-03-2026
66 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా – పెనుకొండ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో నేడు చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల అమరావతి అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. రాజకీయ స్వార్థాల కోసం రెండు రాజధానుల పేరుతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని విమర్శించారు.ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా ముందడుగు వేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రంగేపల్లి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి